PDPL: మంథని- రచ్చపల్లి ఆర్అండ్ఆర్ కాలనీ, ఖమ్మంపల్లి ప్రధాన రహదారిపై సూరయ్యపల్లి గ్రామ శివారులోని వంతెన ప్రమాదకరంగా మారింది. రహదారిపై పలుచోట్ల భారీ గుంతలు ఏర్పడటంతో పాటు, వంతెన రెండు వైపులా రైలింగ్ ధ్వంసమైందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం రాకపోకలు సాగే ఈ మార్గంలో ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రమాదాలు జరిగే అవకాశముందన్నారు.