SRCL: మహిళ మెడలో నుంచి పుస్తెలతాడు లాక్కెళ్ళిన దొంగలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని సిరిసిల్ల సీఐ శ్రీనివాస్ తెలిపారు. సిరిసిల్లలోని సాయి నగర్లో మార్చి 17, 2026న మెరుగు లత తన ఇంటి నుంచి బయటకు రాగా సయ్యద్ మౌలానా, మంగురు ప్రకాష్ యాదవ్ అడ్రస్ అడుగుతున్నట్లు నటించి బాధితురాలి పుస్తెలతాడు తెంపుకెళ్లినట్లు పేర్కొన్నారు.