టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం ఈ ఏడాది సెప్టెంబరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో మరికొంత కాలం తనను కొనసాగించాలని BCCIకి అతడు విజ్ఞప్తి చేసినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ అంశంపై BCCI స్పందిస్తూ.. తమ వద్దకు అలాంటి ప్రతిపాదన ఏదీ రాలేదని వెల్లడించింది. అతడి పదవీకాలం ముగిసిన తర్వాత BCCI కార్యదర్శి దేవజిత్ సైకియా నిర్ణయం తీసుకుంటారని BCCI అధికారులు తెలిపారు.