ADB: ప్రభుత్వం అందజేస్తున్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం పట్టణంలోని శాంతినగర్లో ఏర్పాటుచేసిన వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా DMHO నరేందర్ రాథోడ్ ఆధ్వర్యంలో వైద్య బృందం సభ్యులు రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు.