ADB: జనగణన ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలనీ జిల్లా కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక టీటీడీసీలో సెన్సస్-2027 పై నిర్వహించిన శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సెన్సస్ ప్రక్రియను పూర్తిగా డిజిటల్ పద్ధతిలో నిర్వహిస్తున్నామని అన్నారు. మే 11 నుంచి జూన్ 9 వరకు ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు.