కృష్ణా: స్వాతంత్య్ర సమరయోధులు భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవనం నిర్మాణం ఏర్పాటు చేయాలని కూటమి నాయకులు, స్వచ్ఛంద సంస్థలు మున్సిపల్ కమిషనర్కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. పట్టాభి భవనానికి ఎన్ఓసీ మంజూరు చేసినందుకు కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కోనేరు సెంటర్లో తోట నరసయ్య నాయుడు పేరు పెట్టి విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు.