అన్నమయ్య: తిరుపతిలో మదనపల్లెకు చెందిన ఓ యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మెడికల్ కళాశాల-రుయా ఆస్పత్రి రోడ్డులోని ఫుట్పాత్పై యువకుడి మృతదేహం కనిపించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, మృతుడిని అన్నమయ్య జిల్లా మదనపల్లె సమీపంలోని పొన్నిపాల్యం, కుమారపురం, నమాజ్ కట్ట ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.