AP: గోదావరి నదిలోకి దిగిన ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. పోలవరం జిల్లా ఏటపాక మండలం కూనవరం వద్ద భద్రాచలానికి చెందిన ఏడురుగు స్నానం కోసం నదిలోకి దిగారు. ఈ క్రమంలో లోతు తెలియక ఐదుగురు గల్లంతవగా.. మిగిలిన ఇద్దరు ఒడ్డుకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు బోట్లు, గజఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.