మంచిర్యాల: వేంపల్లి వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడ్డెర కాలనీకి చెందిన పల్లపు ఈశ్వర్ తీవ్రంగా గాయపడ్డాడు. మద్యం మత్తులో అతివేగంగా కారు నడుపుతూ నియంత్రణ కోల్పోయి చెట్టును ఢీకొట్టాడు. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది వెంటనే చేరుకుని ప్రాథమిక చికిత్స అందించి, బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని పోలీసులు హెచ్చరించారు.