NLG: రాష్ట్రంలోని అతిపెద్ద జలాశయాల్లో ఒకటైన నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ప్రతి సంవత్సరం గణనీయమైన స్థాయిలో నీటి ఆవిరి నష్టం జరుగుతోంది. నిపుణుల అంచనా ప్రకారం.. ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీటిలో సుమారు 10 శాతం నుంచి 15 శాతం వరకు ఆవిరి అవుతున్నట్లు తెలుస్తోంది. వేసవికాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు, గణనీయమైన పరిమాణంలో నీరు ఆవిరి అవుతుంది.