ELR: నూజివీడు పట్టణంలోని అనేక వార్డులలో మున్సిపల్ కమిషనర్ కె.పీరయ్య శుక్రవారం ఉదయం పరిశుభ్రతపై పరిశీలన చేశారు. రోడ్లపై విచక్షణారహితంగా చెత్తను కుప్పలుగా వేయడాన్ని గమనించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. చెత్తను సేకరించేందుకు మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది వస్తున్నారని, వారికి తడి చెత్త పొడి చెత్త విడివిడిగా ఇవ్వాలని సూచించారు.