ADB: నార్నూర్ మండలంలోని కొత్తపల్లి(H) నుంచి మహారాష్ట్రలోని పౌరాగడ్ వరకు శుక్రవారం సేవాలాల్ దీక్షాపరుల పాదయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్బంగా దీక్షాగురు ప్రేమ్ సింగ్ మహారాజ్ ఆధ్వర్యంలో సుమారు 300 కిలోమీటర్లు పాదయాత్రగా వెళ్లనున్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలు చేస్తూ భక్తులు పెద్దఎత్తున తరలివెళ్తున్నారు.