RR: యాచారం మండలం మేడిపల్లి గ్రీన్ ఫార్మా సిటీ PSలో CI సత్యనారాయణ పీఎస్ కమిటీ సమావేశం నిర్వహించారు. శాంతి భద్రతలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. ఏవైనా వివాదాలు తలెత్తిన సమయంలో పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. రంజాన్, శ్రీరామనవమి పండుగల ఉత్సవాల సందర్భంగా అందరూ పరస్పర సహకారంతో, సామరస్యంగా వేడుకలు జరుపుకోవాలని కోరారు.