KRNL: ఆస్పరి మండలం కైరప్పలలో భద్రకాళి శ్రీ వీరభద్ర స్వామి ఉత్సవాలలో భాగంగా నేడు పిడకల సమరానికి ప్రజలందరూ సిద్ధమైనట్లు నిర్వాహకులు తెలిపారు. స్వామి వారిపై ఉన్న భక్తితో పిడకల సమరం ఆడతారన్నారు. ఈ సమరంలో పుప్పాల దొడ్డి, కలపరి, బిల్లే కళ్లు, చెన్నంపల్లి, దొడగొండ, కారుమంచి, గ్రామాలు ప్రజలు పాల్గొంటారని నిర్వాహకులు పేర్కొన్నారు.