NLR: నెల్లూరులోని పేదలకు నారాయణ నేత్ర జ్యోతి ద్వారా ఉచితంగా కార్పొరేట్ కంటి వైద్యం అందిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. గత 12 రోజుల్లో 12 చోట్ల శిబిరాలు నిర్వహించి 1,316 మందికి పరీక్షలు చేశామన్నారు. గురువారం తొలి విడతలో 230 మందికి మంత్రి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. రాబోయే రెండేళ్లలో 48 వేల మందికి పరీక్షలు నిర్వహిస్తామన్నారు.