AP: నంద్యాల జిల్లాలోని శ్రీశైల క్షేత్రంలో ఈనెల 16 నుంచి ఉగాది బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉత్సవాలు ముగియనున్నాయి. స్వామివారి యాగశాలలో ఉగాది మహోత్సవాల పూర్ణాహుతి, సాయంత్రం నిజాలంకరణలో శ్రీ భ్రమరాంబికాదేవి దర్శనం కల్పించనున్నారు. అలాగే, ఆది దంపతులు అశ్వవాహనంపై ఆసీనులై పూజలందుకోనున్నారు. నిన్న 77,859 మంది కన్నడ భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.