ADB: బేల మండలం సిర్సన్న గ్రామంలో అహల్యాబాయి హోల్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు అడుగు పడింది. జై మల్హర్ యూత్ ఆధ్వర్యంలో గ్రామస్తుల సమక్షంలో భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. యువత చొరవతో చేపట్టిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. సమాజానికి స్ఫూర్తినిచ్చేలా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.