కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో గురువారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ. 5,28,320 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 1231 మంది స్వామివారిని దర్శించుకున్నారని, అత్యధికంగా 117 ద్విచక్ర వాహనాలకు పూజలు నిర్వహించారని, 8900 మంది అన్న ప్రసాదం స్వీకరించారన్నారు.