CTR: పుంగనూరు SS పేటలోని ఈద్గా మైదానాన్ని అంజుమన్ కమిటీ సభ్యులతో కలిసి సీఐ సుబ్బరాయుడు పరిశీలించారు. శనివారం రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులు నిర్వహించే ప్రత్యేక నమాజుల ఏర్పాట్లపై ఆయన చర్చించారు. ప్రార్థనల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపడుతున్నట్లు సీఐ వెల్లడించారు. శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని ఆయన కోరారు.