CTR: నగరిలోని శ్రీ కరియామాణిక్య స్వామి ఆలయంలో ఉగాది పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో పండితులు పంచాంగ శ్రవణం చేసి, నూతన సంవత్సర ఫలితాలను భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, అర్చకులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.