WGL: సంగెం మండలం గవిచర్లలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న బెల్టు షాపులపై ఎస్సై వంశీకృష్ణ ఆధ్వర్యంలో గురువారం ఆకస్మిక దాడి నిర్వహించారు. పలు షాపుల్లో విక్రయిస్తున్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలోని గుండ బ్రహ్మయ్య ఆలయంలో జాతర జరగనున్న నేపథ్యంలో మద్యం విక్రయాలను నిలిపివేయాలని హెచ్చరించినప్పటికీ వినకపోవడంతో దాడి చేపట్టినట్లు తెలిపారు.