CTR: మాజీ మంత్రి రోజా నగరిలోని తన నివాసంలో తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె గోపూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆమె ఆకాంక్షించారు. అనంతరం నూతన సంవత్సర శుభ ఫలితాలు కలగాలని కోరుకుంటూ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.