RR: మహేశ్వరం నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో నియోజకవర్గ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్న లక్ష్మారెడ్డి పర్యటించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అమీర్పేట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ పర్యటనలో సర్పంచ్లు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.