TPT: ఆంధ్రప్రదేశ్ PCC అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా చేపట్టిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర విజయవంతంగా ముగిసిందని శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 2న ప్రారంభమైన ఈ యాత్ర విశాఖపట్నంలో ముగిసిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 29 జిల్లాల్లో 48 సభలు నిర్వహించగా, ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని చెప్పారు.