TPT: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ పరశురామ స్వామి దేవస్థానంలో పనిచేస్తున్న అర్చకుడు విజయకుమార్ శర్మకు “ఉగాది పురస్కారం” ప్రదానం చేశారు. జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయనను శాలువాతో సన్మానించి, రూ.10,000 నగదు బహుమతిని అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎమ్మెల్యే, తుడా ఛైర్మన్ పాల్గొన్నారు.