BHNG: అంబులెన్స్ సిబ్బంది సమయస్ఫూర్తితో గర్భిణీ సురక్షితంగా ప్రసవించింది. అడ్డగూడూరు మండలంలోని చిర్ర గూడూరుకు చెందిన మనీషాకు గురువారం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో పురిటి నొప్పులు తీవ్రమవ్వడంతో ఈఎంటి యాకస్వామి చాకచక్యంగా అంబులెన్స్లోనే ప్రసవం చేశారు.