AKP: నక్కపల్లిలో ఈనెల 23న జరిగే ఆర్సెలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని టీడీపీ వాణిజ్య విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకర బాబ్జి పిలుపునిచ్చారు. గురువారం కోటవురట్ల మండలం గొట్టివాడ గ్రామంలో ఈ మేరకు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందన్నారు.