డీజిల్ వాహనాలు తయారీ చేస్తున్న కంపెనీలకు కేంద్రం షాక్ ఇచ్చింది. డీజిల్ కార్ల(Diesel cars)పై అదనంగా పది శాతం జీఎస్టీని విధిస్తున్నాట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) తెలిపారు. వాటి విక్రయాలు నిరుత్సాహ పరచాలన్న ఉద్దేశంతో డీజిల్ వాహనాలపై 10 శాతం అదనంగా జీఎస్టీ (GST) విధించేందుకు ప్రతిపాదించనున్నట్లు తెలిపారు. దీన్ని ‘పొల్యూషన్ ట్యాక్స్(Pollution Tax)’గా అభివర్ణించారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman)కు తాను ఓ లేఖ అందించాలనుకుంటున్నట్లు తెలిపారు.
వాయు కాలుష్యం తగ్గించాలన్నదే దీని ఉద్దేశమని చెప్పారు. ఈ మేరకు సియామ్ వార్షిక సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. డీజిల్ వాహనాలకు త్వరగా గుడ్బై చెప్పాలని, లేదంటే ఆ వాహనాలపై పన్ను శాతాన్ని పెంచనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ(Delhi)లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. డీజిల్ వాహనాల వల్ల కాలుష్యం పెరుగుతున్నారు. అందుకే పది శాతం అధిక పన్ను వేయాలని భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు. దీనిపై కేంద్ర ఆర్ధిక శాఖకు ప్రపోజల్ కూడా ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు.
డీజిల్ వాహనాల సంఖ్యను తగ్గించే ఉద్దేశంతో ఈ చర్యకు పాల్పడుతున్నట్లు మంత్రి తెలిపారు. డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాల (Electric vehicles) సంఖ్యను పెంచాలని కేంద్రం యోచిస్తున్నది. కేంద్ర మంత్రి గడ్కరీ ప్రకటన చేసిన నేపథ్యంలో.. టాటా మోటార్స్(Tata Motors), మహేంద్ర అండ్ మహేంద్ర, అశోక్ లేలాండ్ కంపెనీల షేర్లు పడిపోయాయి. గడ్కరీ వ్యాఖ్యల నేపథ్యంలో ఆటోమొబైల్ కంపెనీలైన మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, మారుతీ సుజు(Maruti Suzu)కీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మరోవైపు ప్రయాణికుల వాహన విభాగంలో మారుతీ సుజుకీ, హోండా (Honda) వంటి కంపెనీలు డీజిల్ కార్ల తయారీని ఇప్పటికే నిలిపివేశాయి.
#WATCH | Delhi: "After 2014, 52% of the (number of) diesel vehicles reduced to 18%. Now that the automobile industry is growing, diesel vehicles shouldn't increase. You make decisions at your level so that diesel (vehicle) is reduced. If it wouldn't happen, then I would recommend… pic.twitter.com/B2eoIU2Uqv