KNR: కరీంనగర్ మహాశక్తి ఆలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని సంజయ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. మిత్రులందరితో కలిసి ఉగాది పచ్చడిని సేవించారు. కార్యక్రమంలో మేయర్ శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.