MBNR: జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జర్నలిస్టుల సంక్షేమ నిధికి ఎమ్మెల్యే తన వేతనం నుంచి రూ. 100000 విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తన టర్మ్ పూర్తయ్యే వరకు ప్రతినెల ఒక లక్ష సంక్షేమ నిధికి ఇస్తానన్నారు.