MNCL: రంజాన్ పండుగను పురస్కరించుకుని బెల్లంపల్లి పట్టణంలోని పేద ముస్లిం కుటుంబాలకు రూరల్ సీఐ హనుక్ పండుగ కానుకలను అందజేశారు. గురువారం తన సొంత ఖర్చులతో నిత్యావసర వస్తువుల తోఫాను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి కుటుంబంలో పండుగ సంతోషాలు నింపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, వార్డు ప్రముఖులు పాల్గొన్నారు.