కడప: కలెక్టరేట్ సభా భవన్లో శ్రీ పరాభవనామ ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వేద పండితుడు నాగాంజనేయ శర్మ పంచాంగ శ్రవణం నిర్వహించగా, నలుగురు పండితులకు ఉగాది పురస్కారాలు అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మేళనం సభికులను అలరించాయి.