ఉగ్రవాద కార్యకలాపాలపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమానితుల కోసం తెలంగాణ రాష్ట్రంలో 8 చోట్ల ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. వరంగల్, చర్ల, కొత్తగూడెం (Kothagudem), భద్రాచలంతోపాటు మరో నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. మావోయిస్టుల(Maoists)కు అధునాతన ఆయుధాలు, ఎలక్ట్రికల్ పరికరాల సరఫరాపై తనిఖీలు చేసింది. సోదాల్లో పెద్ద ఎత్తున డ్రోన్లు (Drones) పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ క్రమంలో పలువురిపై కేసులు నమోదు చేశారు.అలాగే ఈ దాడులకు సంబంధించి.. 12 మందిపై NIA కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరిస్తున్నవారిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్వయంతో లోని తెలంగాణలో ఎనిమిది చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విరుచుకుపడుతోంది. భారీ ఎత్తున సోదాలను ప్రారంభించింది. ఉగ్రవాద శిబిరాలను ఏర్పాటు చేసి యువతను ఉగ్రవాద కార్యకలాపాల్లో చేరేలా ప్రోత్సహిస్తున్నారనే అనుమానంతో ఈ సోదాలు (searches) జరుగుతున్నాయి. ఇప్పటికే దేశంలో అనేక చోట్ల ఉగ్రవాదంతో సంబంధం ఉన్న 100 మందిని ఇప్పటి వరకు అరెస్టు చేశారు.