KMM : ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలోని శ్రీ కామాక్షి ఏకామేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ విజయకుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన వెంట స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.