MDCL: చిల్కానగర్ డివిజన్లో పెండింగ్ పనులపై మాజీ కార్పొరేటర్ బన్నాల గీత స్పందించారు. సాంక్షన్ అయిన పనులను వెంటనే ప్రారంభించకపోతే కాంట్రాక్టర్ల పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సివరేజ్ పనుల తర్వాత రోడ్లు పునరుద్ధరించని వారి పై చర్యలు తీసుకోవాలని కోరారు. లో ప్రెషర్ నీటి సమస్య పరిష్కరించాలని జీఎంను కోరగా, అధికారులు సానుకూలంగా స్పందించారు.