KDP: కాశీనాయన(M) సావిశెట్టిపల్లెలో బుధవారం సాయంత్రం గాలితో వడగండ్ల వర్షం బీభత్సం సృష్టించింది. అకాల వర్షం కారణంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికి వచ్చిన అరటి, మొక్కజొన్న, సజ్జ కోత జరుగుతుండగా గాలివాన వర్షం బీభత్సం సృష్టించడంతో రైతులు కుదేలయ్యారు. కాశీనాయన మండలంలో దాదాపు 200 ఎకరాల వరకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. అధికారులు న్యాయం చేయాలని రైతులు కోరారు