RR: చేవెళ్ల మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రూ. 100 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని టీపీసీసీ మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ అష్వాక్ అలీ డిమాండ్ చేశారు. పట్టణంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్లు, వంటి మౌలికసదుపాయాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు.