KNR: తిమ్మాపూర్ మండలం పోరండ్ల గ్రామంలో బుధవారం మాల సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు ఉపవాస దీక్షలతో నెత్తిన బోనం ఎత్తుకుని శివసత్తుల పూనకాలతో, డప్పు చప్పుళ్లతో ఊరేగింపుగా పోచమ్మ ఆలయం చేరుకున్నారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సర్పంచ్ అసోద శ్రీనివాస్, వార్డు సభ్యులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.