దేశంలో ఉగ్రవాదులకు డ్రోన్ శిక్షణ ఇచ్చేందుకు వచ్చిన అంతర్జాతీయ టెర్రర్ నెట్వర్క్ను జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) పట్టుకుంది. ఈ ఆపరేషన్లో మొత్తం ఏడుగురు విదేశీయులను అధికారులు అరెస్ట్ చేయగా, వారిలో ఆరుగురు ఉక్రెయిన్ పౌరులు ఉన్నట్లు గుర్తించారు. వీరు భారత్లో డ్రోన్ల వినియోగంపై ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చేందుకు వచ్చినట్లు విచారణలో తేలింది.