W.G: భీమవరం కొత్త బస్టాండ్ ఆవరణలో ఆర్టీసీ ఆధ్వర్యంలో ‘దివ్యాంగ శక్తి’ పథకం కింద దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే రామాంజనేయులు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ దివ్యాంగులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మానవీయత చాటుతూ వారితో కలిసి కలెక్టర్ భోజనం చేశారు.