MHBD: తొర్రూరు డివిజన్ కేంద్రంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లో నిన్నతహసీల్దార్ శ్రీనివాస్ అదనపు ఎస్సై అంజమ్మ, సివిల్ సప్లై అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రకాళి రెస్టారెంటులో రెండు గృహ అవసరాల సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్కు వాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.