»Sanathana Dharmam Swami Paramahamsa Acharya Will Give 10 Crores If Tamil Nadu Minister Udayanidhi Stalins Head Beheaded
Udayanidhi Stalin: ఉదయనిధి తల నరికి తెస్తే రూ.10 కోట్లు ఇస్తాం
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో చూస్తూనే ఉన్నాము. ఈ నేపథ్యంలో ఆయన తల నరికి తెస్తే రూ.10 కోట్ల ఆఫర్ ఇచ్చారు ఓ స్వామిజీ. ఈ మాటలపై ఉదయనిధి చేసిన కామెంట్స్ తెగ వైరల్గా మారాయి.
Swami Paramahamsa Acharya Will Give 10 Crores If Tamil Nadu Minister Udayanidhi Stalin's Head Beheaded
Udayanidhi Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి(CM), డిఎంకే(DMK) పార్టీ అధినేత స్టాలిన్ తనయుడు మంత్రి, నటుడు ఉదయనిధి స్టాలిన్(Udayanidhi Stalin) సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు దేశమంతట ప్రకంపనాలు సృష్టించాయి. ముఖ్యంగా హిందుధర్మ పరిరక్షణ సంస్థలు, స్వామిజీలు, బీజేపీ(BJP) పార్టీ నేతలు ఉదయనిధిపై మండిపడుతున్నారు. తాజాగా స్వామీజీ పరమహంస ఆచార్య(Swami Paramahamsa Acharya) చేసిన కామెంట్స్ కూడా అంతే స్థాయిలో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సనాతన ధర్మం(Sanathana Dharmam)పై ఆయన చేసిన మాటలను ఉద్దేశించి ఉదయనిధి స్టాలిన్ తల నరికి తెచ్చిన వారికి రూ.10 కోట్లు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. ధర్మం కోసం ఎంత దూరం అయినా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు స్వామిజీ పేర్కొన్నారు.
దీనిపై మంత్రి ఉదయనిధి స్పందించారు. తాను మాట్లాడిన దాంట్లో ఏ తప్పు లేదని ఉన్నదే అన్నట్లు ఆయన పేర్కొన్నారు. తన తల కోసం ఎవరు వస్తారో చూస్తానన్నారు. గతంలో కరుణానిధి(Karunanidhi) పై కూడా రూ.1 కోటి ప్రకటించారని, ఇప్పుడు తనపై బహుమతి ప్రకటించారని వెల్లడించారు. తాను ఎవరికీ భయపడే లేదని స్పష్టం చేశారు. అలాగే స్వామిజీలకు అంత డబ్బు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే రెండు రాష్ట్రాల బీజేపీ నేతలతోపాటు హిందూ సంఘాలు సహా అనేక మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణాలో రాజాసింగ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి దీనిపై స్పందించారు. దేశంలో పలు మీడియా సంస్థలు డిబెట్లు సైతం నిర్వహించాయి. అయినా సరే ఉదయనిధి తాను చేసిన వ్యాఖ్యాలకు కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. కులం, మతం పేరిట ప్రజలను విడదీసేదే సనాతన ధర్మం అని, అటు న్యాయస్థానాల్లో అయినా, ఇటు ప్రజా న్యాయస్థానంలో అయినా తేల్చుకోవడానికి తాను సిద్దంగా ఉన్నట్లు పేర్కొన్నారు. సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియాలాంటిదని దాన్ని సములంగా నిర్మించాలనే ఆయన చేసిన వ్యాఖ్యలతో ఈ రాజకీయ దుమారం రేగింది.
ఉదయనిధి స్టాలిన్ తల నరికి తెస్తే రూ.10 కోట్లు ఇస్తానన్న స్వామీజీ పరమహంస ఆచార్య
నా తల కోసం ఎవరు వస్తారో చూస్తా. గతంలోనూ కరుణానిధిపై రూ.కోటి ప్రకటించారు. నేను ఎవరికీ భయపడను. స్వామీజీలకు కోట్ల డబ్బు ఎలా వచ్చిందని ఉదయనిధి ప్రశ్నించారు. pic.twitter.com/nQm0qd613F