VSP: అర్హులైన పేదలకు అర్బన్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు మురుపల్లి పైడిరాజు అన్నారు. బుధవారం మధురవాడలో ఆయన మాట్లాడారు. ఈనెల 24 నుంచి సచివాలయాల వద్ద ధర్నాలు చేపడతామని తెలిపారు. ఇళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, పెన్షన్ల కోతలు ఆపాలని కోరారు.