శ్రీకాకుళం పట్టణంలో సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు, సాగు భూమి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఈనెల 24వ తేదీన రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమం ఉంటుందని బుధవారం తెలిపారు. అర్హులైన పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇంటి ఇవ్వాలని సూచించారు.