MNCL: కోల్ మైన్స్ పెన్షన్ పథకం-1998 వెంటనే సవరించాలని పెద్దపల్లి MP వంశీకృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం న్యూఢిల్లీలో CMPF కమిషనర్ సంజీష్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. సింగరేణి రిటైర్డ్ కార్మికులకు వస్తున్న పెన్షన్ చాలా తక్కువగా ఉందని, దానివల్ల వారు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. కార్మికులు గౌరవప్రదమైన జీవితం గడిపేలా పెన్షన్లు పెంచాలన్నారు.