ASF: ముస్లిం సోదరుల పవిత్రమైన రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని బుధవారం పట్టణంలోని ఈద్గా స్థలాన్ని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ పరిశీలించారు. పండుగ రోజు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనే నేపథ్యంలో ఏర్పాట్లు సక్రమంగా ఉండాలని ఆమె సూచించారు. రంజాన్ పండుగ శాంతి, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని, అందరూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని పేర్కొన్నారు.