ప్రకాశం: నూతన నోటరీ న్యాయవాదిగా మార్కాపురానికి చెందిన మొగల్ అన్వర్ బేగ్ను ఏపీ ప్రభుత్వం బుధవారం నియమించింది. ఏ మేరకు రెవిన్యూ (రిజిస్ట్రేషన్ – ll) శాఖ జీవో జారీ చేసింది. మార్కాపురం ప్రాంత ప్రజలకు ఇకపై మరిన్ని సేవలు మరింత సులభంగా అందుబాటులోకి రానున్నాయని, పూర్తి వివరాల కోసం కోర్టు సెంటర్ సమీపంలో గల తమ కార్యాలయంలో సంప్రదించాలని ప్రజలకు ఆయన సూచించారు.