SRPT: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన ఈవీ వాహనాలు, వ్యవసాయ పరికరాల రాయితీ పథకాలను నిరుద్యోగ యువత ఉపయోగించుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. 60 నుంచి 90 శాతం రాయితీ ఉండే ఈ పథకాలకు ఈనెల 24 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆసక్తి గల అర్హులు తమ పత్రాలను కలెక్టరేట్లో సమర్పించాలని పేర్కొన్నారు.