అన్నమయ్య: మున్సిపల్ కౌన్సిల్ పదవీకాలం ముగియడంతో జేసీ మధుసూదన్ రావును మదనపల్లి మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా నియమించారు. బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించి, మౌలిక సేవలు అంతరాయం లేకుండా కొనసాగిస్తామని తెలిపారు. పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.