MNCL: చిన్నారుల విద్యాభివృద్ధిలో తల్లిదండ్రులు కీలక పాత్ర పోషించాలని దండేపల్లి మండలంలోని గుడిరేవు ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం బుచ్చయ్య అన్నారు. బుధవారం ఆ పాఠశాల ఆవరణలో ‘అమ్మానాన్న ఆశీర్వాదం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు తమ తల్లిదండ్రుల కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.