BHNG: రామన్నపేట పట్టణ కేంద్రంలో ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్లో జిల్లా ఎస్పీ విష్ణుమూర్తి విలేకరుల సమావేశం నిర్వహించారు. పంతంగి టోల్గేట్ వద్ద తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడినట్లు తెలిపారు. ఒడిస్సా నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న 60 కిలోల గంజాయిని సీజ్ చేసి, ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషుల అరెస్టు చేశారు. దీని విలువ సుమారు రూ.33లక్షలు ఉంటుందని వెల్లడించారు.